Saturday, September 2, 2017

అత్యంత తక్కువ ధరకే స్మార్ట్‌ టివి




ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మితాషి అతి చవకైన స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. 32 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ ధర 22,990,

39 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ ధర 39,990 రూపాయలుగాను నిర్ణయించింది. ఇవి రెండూ ఆన్‌లైన్‌ రిటైలర్‌ అమెజాన్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. 


వీటిని ప్రత్యేక ఆఫర్‌ కింద అమెజాన్‌ 20,990 రూపాయలకు, 34,990 రూపాయలకు అందిస్తోంది. మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంది. ఫీచర్‌ల విషయానికి వస్తే ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌క్యాట్‌ ఆపరేటింగ్‌ సిస్టం, కర్వ్‌డ్‌ స్ర్కీన్‌ డైనమిక్‌ కాంట్రాస్ట్‌, 1.1 గిగా హెడ్జ్‌ కోర్టేక్స్‌ ఏ7 ప్రాసెసర్‌, విత్‌ మాలి 400 ఇంటూ 2 జిపియు, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, మైక్రోఎస్‌డీకార్డు రీడర్‌ ద్వారా స్టోరేజ్‌ సామర్ధ్యం పెంచుకోవచ్చు.